రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సెట్లో మెగా పవర్స్టార్ రామ్చరణ్ అసహనం గురైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్లో శరవేగంగా జరుగుతోంది. చరణ్-తారక్లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు తాజాగా కొద్ది రోజుల కోసం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అఫీషియల్ ఇన్ స్టా అకౌంట్ తారక్ తన చేతిలోకి తీసేసుకున్నాడు.
అంతే కాదు, ఫస్ట్ వీడియోని కూడా పోస్ట్ చేశాడు ‘భీమ్’… మా ‘భీమ్’ కొద్ది రోజులు ఇన్ స్టాగ్రామ్ ని టేకోవర్ చేస్తున్నాడు’ అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన గంటల వ్యవధిలోనే తొలి వీడియోతో ఫ్యాన్స్ కి ట్రీట్ అందించాడు జూనియర్.
ఇందులో భాగంగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ షేర్ ఓ వీడియోలో రామ్చరణ్ కొంత అసహనానికి గురైనట్లు ఇందులో చూడవచ్చు. ‘చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ అయ్యిందా?’ అని తారక్ అడగ్గా.. ‘అయిపోయింది. నిజమైన డ్రమ్స్ ఎక్కడ కార్తికేయ. కాస్ట్యూమ్ లేదు. ఏం లేవు. పొద్దుపొద్దునే తీసుకువచ్చి కూర్చొపెట్టారు’ అని రాజమౌళి కుమారుడిపై చరణ్ సరదాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్కడే ఉన్న కార్తికేయ.. ‘వస్తున్నాయి. రెండు నిమిషాలు’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.
కాగా.. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమురంభీమ్గా తారక్ కనిపించనున్నారు. ఆలియాభట్, అజయ్ దేవ్గణ్, శ్రియ, సముద్రఖని, ఒలీవియా మోరీస్, ఎలిసన్ డ్యూడీ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.