ఇవాళ దివంగత సీఎం, స్వర్గీయ నందమూరి తారక రామరావు 97వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ప్రతీ ఏటా జయంతి రోజున నివాళులు అర్పిస్తుంటారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఘాట్ వద్దకు వెళ్లకూడదని నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ లాక్ డౌన్ ఆంక్షలకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మనవడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
మీరు లేని లోటు తీరనిది… pic.twitter.com/FA1uyWaWoS
— Jr NTR (@tarak9999) May 28, 2020
“మీరు లేని లోటు తీరనది” అంటూ ట్వీట్ చేశారు. తాత ఎన్టీఆర్ ఫోటోతో పాటు… “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా” అంటూ ఎన్టీఆర్ తాత ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా తన ట్విట్టర్లో తాత జయంతి సందర్భంగా ట్వీట్ చేశారు. “మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత” అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. తాతతో పాటు నాయనమ్మ ఫోటోను కూడా షేర్ చేశారు.
మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత #joharntr pic.twitter.com/Q7IdzByw1u
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) May 28, 2020
అన్న నందమూరి తారకరాముని 97 వ జయంతి
మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడి, పునార్జింప చేసి
యావత్ భారత దేశ శిఖరంపై పెట్టిన
తెలుగు మొనగాడు, అన్న ఎన్టీఆర్…
తెలుగు భాషకు ప్రాధ్యానత ఇచ్చిన
మన అన్న ఎన్టీఆర్ కి జోహార్…..
ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించటం
మన తెలుగు జాతి చేసుకున్న
పూర్వ జన్మ సుకృతం…..
సదా మీ సేవలో
నందమూరి రామకృష్ణ
జయలలిత పాత్రలో నటించడానికి నేనే పర్ఫెక్ట్ : నిత్యామీనన్