*ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య
*ఒత్తిడి అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య..
*ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య..
*పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (52) ఆత్మహత్య చేసుకున్నారు.
జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సోమవారం ఉదయం ఫ్యాన్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో ఆమె ఉరేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆమె మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలిస్తున్నారు. అక్కడ పోస్ట్ మార్టమ్ నిర్వహించిన తర్వాతే.. ఆమె ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు అందే అవకాశముంది.
ఉమా మహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉమామహేశ్వరి ఇంటికి నందమూరి, చంద్రబాబు కుటుంబసభ్యులు చేరుకున్నారు. విదేశాల్లోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు