అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్పుల్ ఎంటర్టైనర్ “మిస్టర్ మజ్ను”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలను విడుదల చేశారు. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 19న నిర్వహించనున్నారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రబృందం. మొదటి నుంచి అఖిల్ తన సినిమాల ప్రమోషన్ కోసం స్టార్ హీరోల సపోర్ట్ తీసుకుంటున్నాడు. ముందుగా “అఖిల్” సినిమా కోసం మహేష్ ను, ఆ తరువాత “హలో” సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తీసుకున్నాడు. ఈసారి ఎన్టీఆర్ ను ప్రమోషన్స్ కు తీసుకొస్తున్నాడు. మరి ఈసారైనా హిట్టు కొడతాడేమో చూడాలి.