telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు

రేపటి నుంచి ప్రారంభం కానున్న జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్టీఏ

జేఈఈ మెయిన్స్ – 2025 సెషన్ – 1 పరీక్షలు 22 జనవరి 2025 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఐఐటీలతో పాటు పలు ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కోసం జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ నెల 22, 23, 24, 28, 29, 30 జనవరి 2025 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

పరీక్ష రాసే విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎగ్జామ్ హాల్లోకి విద్యార్థులు కచ్చితంగా అడ్మిట్ కార్డును తీసుకెళ్లాలి.

లేకపోతే పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఫొటోతో కూడిన గుర్తింపు కార్డును చూపించాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకుని వెళ్లాలి.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసినప్పుడు అప్ లోడ్ చేసినటువంటి పాస్ పోర్టు సైజు ఫోటోను తీసుకెళ్లాలి.

దివ్యాంగులైన విద్యార్థులు తమ వెంట మెడికల్ సర్టిఫికెట్లు వుంచుకోవాలి. నగలు, మెటాలిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

బ్యాగ్, పర్సు, ప్రింటెడ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్, జామెట్రీ బాక్స్ వంటి నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదు.

Related posts