లెజెండ్ సినిమాలో బాలయ్యతో నటించిన హీరోయిన్ రాధిక ఆప్టే. తాజాగా ఈ భామ ఆస్పత్రిలో మాస్క్తో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీంతో ఆమెకు కరోనా వచ్చిందంటూ పుకార్లు పుట్టించారు. నిమిషాల్లో వార్తను వైరల్ చేసి పడేశారు. దీంతో ఇప్పుడు లెజెండ్ భామ ఆ విషయంపై స్పష్టత ఇచ్చింది. తాను ఎలాంటి కరోనా పరీక్షలు చేయించు కోలేదని తెలిపింది. తనకు కరోనా లక్షణాలేవీ లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేసింది. ముఖానికి మాస్కు ధరించి ఓ ఆసుపత్రిలో ఉన్న ఫొటోను రాధిక తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తాను ఆసుపత్రికి వచ్చానని, అయితే, కరోనా పరీక్షల కోసం కాదని తెలిపింది. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా బాగానే ఉందని హాష్ ట్యాగ్స్ జత చేసింది. ఇంట్లోనే ఉండి, భద్రంగా ఉండాలంటూ తన అభిమానుల్ని, నెటిజన్స్ను కోరింది రాధిక. అయితే.. ఆస్పత్రికి ఎందుకు వచ్చానన్న విషయాన్ని మాత్రం రాధిక తెలపలేదు. దీంతో ఇప్పుడు ఆ విషయంపై ఆరా తీస్తున్నారు ఆమె ఫ్యాన్స్.
రజినీకాంత్, కమల్ హాసన్ లపై కట్టప్ప వ్యాఖ్యలు