telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి పదవి దక్కలేదని అలగలేదు: జోగు రామన్న

Jogu-Ramanna

తెలంగాణ మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మంత్రివర్గ విస్తరణ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు కూడా ఎటువెళ్లారో తెలీదని చెప్పడంతో రామన్న అనుచరుల్లో గతరెండు రోజులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఆయన బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మంగళవారం నాడు రామన్న మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదన్నారు.

మంత్రిపదవి రాకపోవడంతో మినిస్టర్ క్వార్టర్స్ ఖాళీ చేస్తున్నామని, రెండు రోజులుగా నా పిల్లలు ఆ పనిలో ఉన్నారన్నారు. నాకు కొంత ఆరోగ్యం బాగాలేక, లోబీపీ వల్ల రెస్ట్ తీసుకుందాం అని స్నేహితుడు ఇంటికి వెళ్ళానని చెప్పారు. మంత్రి పదవి దక్కలేదని అలగలేదని అన్నారు. పార్టీ మరే ప్రసక్తే లేదని, చివరి వరకూ టీఆర్‌ఎస్‌లోనే ఉంటానని జోగు స్పష్టం చేశారు.

Related posts