telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ముగిసిన నోముల అంత్యక్రియలు…

ప్రభుత్వ లాంఛనాలతో నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో  అశ్రునయనాల నడుమ నాగార్జున  సాగర్ శాసన సభ్యులు నోముల నరసిమ్మయ్య  అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ  చైర్మన్ నేతి విద్యాసాగర్, హోమ్ మంత్రి మహమూద్ అలీ తో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ నోముల చిత్రపటానికి, భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నోముల నరసిహయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం నరసింహయ్య కొడుకు భగత్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీఆరెఎస్ తో పాటు సీపీఎం పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు, నోముల అభిమానులు, ప్రజలు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బయలు దేరారు సీఎం కేసీఆర్.

Related posts