telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికులు కాదు.. ఆర్టీసీ ఉద్యోగులు..పిలుపు మార్చా .. : కెసిఆర్

kcr stand on earlier warning to rtc employees

ఆర్టీసీ సమ్మె అనంతరం అప్పటి కార్మికులతో కలిసి ఆత్మీయ సమావేశం లో కెసిఆర్ అనేక వరాలు ఇచ్చారు. ఆర్టీసీ కోసం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రిటైర్మెంట్ వయసును 60 సంవత్సరాలకు పెంచారు. మహిళలకు సంబంధించిన విధులను రాత్రి 8 వరకు పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. అదే విధంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలని, బోనస్ అందుకునేలా చేయాలని కెసిఆర్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు కెసిఆర్ ఇప్పుడు మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో పనిచేసే వాళ్ళను ఆర్టీసీ కార్మికులుగా పిలిచేవారు.

ఇకవై వారిని ఉద్యోగులుగా పిలుస్తూ సర్క్యులర్ జారీ చేసింది కెసిఆర్ ప్రభుత్వం. అంటే ఇకపై వారిని ఉద్యోగులుగా పిలుస్తారు. ఇది కాస్త ఆర్టీసీ ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఈ నిర్ణయం ఎందుకంటే, ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. నిన్నటి రోజున దీనికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీంతో ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో బిల్లు చట్టం దాల్చింది. నిన్నటి నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ఆర్టీసీకి ఉద్యోగులకు అయ్యే జీతభత్యాలను ప్రభుత్వమే భరిస్తుంది. ఏటా ఇందుకోసం రూ. 3600 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నది.

Related posts