telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎంతమంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’ ఇస్తాం: మంత్రి లోకేశ్

‘తల్లికి వందనం’ పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యం. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి రూ.15,000 ఇస్తాం.

అందులో సందేహం లేదు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకూ ఈ పథకం వర్తిస్తుంది’ అని శాసనమండలిలో వెల్లడించారు

Related posts