సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్పై సినిమా నిర్మితమవుతుంది. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం కరోనా కారణంగా సెట్స్పైకి వెళ్లడానికి మాత్రం సమయం తీసుకుంటుంది. మరో పక్క ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. అందులో ఓ హీరోయిన్గా మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటించనున్న సంగతి తెలిసిందే. కాగా.. మరో హీరోయిన్గా మలయాళీ బ్యూటీ నివేదా థామస్ నటించనున్నారని టాక్. మరి ఇందులో నిజమెంత ఉందొ చూడాలి.
previous post