telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సర్కారు వారి పాట”లో మరో హీరోయిన్

niveda

సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి మాత్రం స‌మ‌యం తీసుకుంటుంది. మ‌రో ప‌క్క ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌నున్నారు. అందులో ఓ హీరోయిన్‌గా మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. మ‌రో హీరోయిన్‌గా మ‌ల‌యాళీ బ్యూటీ నివేదా థామ‌స్ న‌టించ‌నున్నార‌ని టాక్‌. మ‌రి ఇందులో నిజమెంత ఉందొ చూడాలి.

Related posts