యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా పట్టాలెక్కించాడు నితిన్. ‘మహానటి’ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్కు గత ఐదు నెలలుగా ఆగిపోయింది. కాస్త విరామం తర్వాత మళ్లీ ‘రంగ్ దే’ షూటింగ్ తాజాగా హైదరాబాద్లో తిరిగి ప్రారంభమైంది. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ‘రంగ్ దే’ షూటింగ్ను తిరిగి ప్రారంభించారు. తొలిరోజు షూటింగ్లో నితిన్ సహా పలువురు ప్రముఖ నటులు పాల్గొన్నారు. ‘రంగ్ దే’ టాకీ పార్ట్ చాలా వరకు పూర్తయింది. కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. నిర్విరామంగా షూటింగ్ జరిపి 2021 సంక్రాంతికి ‘రంగ్ దే’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారని గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
previous post
next post
బిత్తిరి సత్తిపై శివజ్యోతి కామెంట్స్… ఏమందంటే ?