telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్క మీద స్పెషల్ ఈవెంట్… 15 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా…

anushka

నాగార్జున హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్’ సినిమాతో నటిగా టాలీవుడ్ లోకి ప్రవేశించారు అనుష్క శెట్టి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి’ సినిమాలో టైటిల్ రోల్‌లో నటించి అత్యద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. రాజమౌళి తీసిన ‘బాహుబలి’ రెండు భాగాల్లో నటించి మరింత గొప్ప పేరుని గడించారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘నిశ్శబ్దం’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు కలసి నిర్మిస్తున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకుడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్క సినిమా రంగానికి ప్రవేశించి విజయవంతంగా 15 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ‘నిశ్శబ్దం’ మూవీ యూనిట్, ఈనెల 12న సాయంత్రం 6 గంటలకు ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించనుంది. అయితే ఈ వేడుక తాలూకు తదితర విషయాలు తెలియాల్సి ఉంది.

Related posts