telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిశ్శబ్దం : షాకిచ్చిన కేబుల్ ఛానెల్… కోటి డిమాండ్ చేస్తున్న నిర్మాతలు

nishabdam

అనుష్క శెట్టి, మాధవన్, సుబ్బరాజు, షాలిని పాండే, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన మిస్టరీ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. అయితే, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా చిత్ర యూనిట్ అయితే ‘నిశ్శబ్దం’ను ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉంది. ఈ సమయంలో చిత్ర నిర్మాతలకు అనుకోని షాక్ తగిలిందట. ఈ సినిమా అమెజాన్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఓ కేబుల్ ఛానల్ ప్రసారం చేసేసిందని సమాచారం. ఈ విషయం నిర్మాతల దృష్టికి వెళ్లింది. ఆ కేబుల్ ఛానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాతలు.. వారికి లీగల్ నోటీస్ పంపినట్టు సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఆ కేబుల్ ఛానల్‌ను డ్యామేజ్ ఛార్జెస్ కింద నిర్మాతలు రూ.1.1 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అమెజాన్ ప్రైమ్ సైతం మరో రూ.30 లక్షలు డిమాండ్ చేస్తుందట. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించగా.. దాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ రీట్వీట్ చేశారు. మరి ఇంత మొత్తాన్ని ఆ కేబుల్ ఛానల్ కడుతుందో లేదంటే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.

Related posts