telugu navyamedia
రాజకీయ వార్తలు

వలస కార్మికుల విషయంలో రాజకీయాలు చేయడం తగదు: నిర్మలా సీతారామన్

Nirmalasitaraman

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికుల అంశంపై అందరం కలిసి పనిచేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వలస కార్మికుల పరిస్థితులపై రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వలస కార్మికుల విషయంలో రాజకీయాలు చేయడం తగదని ఆమె హితవు పలికారు.

ఈ సమస్యపై మేము అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నాం. సోనియా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తూ నేను ఒకటి చెబుతున్నాను. వలసకార్మికులపై మరింత బాధ్యతగా మాట్లాడాలి, వారి సమస్యలను పరిష్కరించాలి’ అని వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో నిజాయతీగా వ్యవహరించాల్సింది పోయి, రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

Related posts