సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “దొరసాని”. ఈ చిత్రంతో కేవీఆర్ మహేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు. సన్ని కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. నిజ జీవితానికి దగ్గరగా ఎంతో రియలిస్టిక్గా తెరకెక్కుతున్న “దొరసాని” చిత్రం తెలంగాణలోని ఓ ప్రాంతంలో 80వ దశకంలో జరిగిన కథగా వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. “నింగిలోని పాలపుంత నవ్వులొంపెనే .. నేలపైన పాలపిట్ట తొవ్వగాసెనే ..” అంటూ ఈ పాట సాగుతోంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం, గోరెటి వెంకన్న సాహిత్యం, అనురాగ్ కులకర్ణి ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. మీరు కూడా ఈ లిరికల్ సాంగ్ ను వినేయండి మరి.
next post
తారక్ రాజకీయాల్లోకి వస్తే… ఎదురు చూస్తున్నా.. : మంచు మనోజ్