పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు,పర్యటించారు. టిడ్కో గృహ సముదాయంలో పనులు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
టిడ్కో గృహాలను 80 శాతం పూర్తి చేశాం, వైసీపీ హయాంలో మిగిలిన 20 శాతం ఇళ్లు పూర్తి చేయలేదు అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను తాకట్టు పెట్టి రూ.5వేల కోట్లు దారి మళ్లించారు అన్నారు.
బ్యాంకు రుణం సొమ్మును ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేయలేదు అన్నారు.
టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందరికీ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అన్నారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి అజెండాగా ప్రభుత్వం పనిచేస్తోంది పనిచేసే ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్లు ఉండేలా ఆశీర్వదించాలి అని నిమ్మల రామానాయుడు అన్నారు.

