telugu navyamedia
సినిమా వార్తలు

హైదరాబాద్ పబ్​లో పట్టుబడిన వారిలో మెగా డాట‌ర్ నిహారిక‌..

హైదరాబాద్‌లో ఇటీవల భారీగా డ్రగ్స్‌ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే  హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్‌లో టాస్క్​ఫోర్స్​ పోలీసులు నిర్వహించిన దాడిలో పబ్​ యజమాని సహా 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్‌ సిబ్బంది ఉన్నారు.

వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. పుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ లో రాత్రి జరిగిన పార్టీలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కూడా పాల్గొంది.

అయితే నిహారికాను విచారించిన పోలీసులు తర్వాత ఆమెకు నోటీసులిచ్చి పంపివేశారు.
నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళ‌డానికి బయటికి వ‌స్తుండ‌గా మీడియా ప్రతినిధులు ఆమెను చుట్టుముట్టి స్పందించాలని కోరగా, ఆమె ఫోన్లో మాట్లాడుకుంటూ నెంబరు ప్లేటు లేని కారులో వెళ్లిపోయారు. పట్టుబడిన

ప‌బ్బులో ప‌ట్టుబ‌డిన వారిలో సినీ, రాజకీయ, పారిశ్రామికవేత్తల పిల్లలు ఉండగా, అందులో కొందరి వద్ద నుంచి కొకైన్ ,గంజాయి, ఎల్ఎస్​డీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Related posts