telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో విజృంభిస్తున్న కరోనా..

క‌రోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇక తాజాగా ఏపీలో కూడా కరోనా కేసులు భారీ సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో 39,816 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,528 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైనా మొత్తం కేసుల సంఖ్య 20,93,860 కు చేరింది.

ఇప్పటి వరకు 14,508 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,313 గా ఉన్నాయని తెలిపింది. 418 మంది కోవిడ్‌ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతులు అయ్యారని ఏపీ వైద్యాధికారులు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.

ఏయే జిల్లాల్లో ఎన్ని పాజిటివ్‌ కేసులు..

గడిచిన 24 గంటల్లో అనంతపూర్‌లో 300 పాజిటివ్‌ కేసులు, చిత్తూర్‌లో 1022, ఈస్ట్‌ గోదావరి327, గుంటూరులో 337, కృష్ణాలో166, కడపలో 236, కర్నూల్‌లో 164 విశాఖపట్టణంలో 992, శ్రీకాకుళంలో 385 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడించారు.

Related posts