బసవతారకం కేన్సర్ ఆసుపత్రి లో ఇవాళ మరో మణిపూస చేరిందని నటుడు, ఆ ఆస్పత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో డిజిటల్ రేడియోగ్రఫీ సదుపాయాన్ని శుక్రవారం బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేడియాలజీ విభాగంలో ఇప్పటికే 3డీ డిజిటల్ మమ్మోగ్రామ్ ఉందని, కొత్తగా డిజిటల్ రేడియోగ్రఫీని కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ఎంతో వేగవంతమైనదని తెలిపారు. సాధారణంగా ఫిల్మ్ పైన తీసే ఎక్స్ రేని డిజిటల్ రూపంలో వెంటనే చూసే వీలుంటుందని వివరించారు.
ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ద్వారా తీసే ఎక్స్ రే ఇమేజ్ మంచి నాణ్యతతో ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 8 గంటల వ్యవధిలో 200కి పైగా నాణ్యమైన ఎక్స్ రే ఇమేజ్లు తీయవచ్చని వెల్లడించారు. ముఖ్యంగా కేన్సర్ రోగులు తక్కువ రేడియేషన్కు గురవుతారని వివరించారు. ఇది పర్యావరణహిత సాంకేతికత అని ఆయన తెలిపారు. ఎలాంటి కొత్త టెక్నాలజీనైనా బసవతారకం ఆసుపత్రిలో ప్రవేశపెట్టేందుకు తామెప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. ఇటువంటి అత్యాధునిక టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలన్నదే నాన్న గారి ఆశయం అని బాలకృష్ణ పేర్కొన్నారు.
టిక్కెట్ రేట్లపై ప్రభుత్వానికి చెప్పాల్సింది చెప్పా..ఇకపై