డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో ‘”జేమ్స్ బాండ్” 25వ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కేరీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం బ్రిటన్లోని ప్రఖ్యాత పైన్వుడ్ స్టూడియోస్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే 25వ మూవీ చిత్ర కథ ఉండబోతోందని సమాచారం. అయితే జేమ్స్ బాండ్ 25వ చిత్రానికి అడుగడున సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవలే సీన్లో భాగంగా సెట్లో పరుగెత్తుతున్నప్పుడు డేనియల్ కాలు మడతపడి కింద పడిపోవడంతో ఆయన చీలమండకి గాయం అయింది. దీంతో ఈ మూవీ కొద్ది రోజుల పాటు వాయిదా పడింది. తాజాగా సెట్లో స్టంట్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా మూడు సార్లు పేలుడు సంభవించింది. దీంతో సెట్కి సంబంధించిన ఫర్నీచర్ మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. సెట్ బయట నిలబడిన ఓ వ్యక్తికి స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 2020 ఏప్రిల్ 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర భావిస్తోంది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే చిత్ర విడుదల మరింత లేటయ్యేలా కనిపిస్తుంది.
previous post
ఆ స్టార్ హీరో సెట్లోనే నాతో చాలా దారుణంగా వ్యవహరించారు : హీరోయిన్