telugu navyamedia
వార్తలు సామాజిక

ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల మళ్లింపు

heavy rains in telangana for 2days

దేశ రాజదాని ఢిల్లీలో గత రాత్రి మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల పై వరద నీరు పొంగి ప్రవహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పార్లమెంట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, లోధి రోడ్, ఆర్‌కే‌పురం తదితర ప్రాంతాల్లో నీరు నిలవడంతో వాహనదారులు నానా ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు, వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలోకి నీరు భారీగా చేరింది. దీంతో రన్‌వేను మూసివేసిన అధికారులు ఢిల్లీకి రావాల్సిన విమానాలను జోథ్‌పూర్, జైపూర్, లక్నో తదితర నగరాలకు మళ్లించారు.

Related posts