telugu navyamedia
వార్తలు సామాజిక

ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 74 మందికి కరోనా లక్షణాలు!

deaths increased to 131 due to corona virus

ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మసీదు సమావేశాలకు వెళ్లొచ్చిన వారిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 603 మంది ఉన్నారు. వారి కుటుంబాల్లో కొందరికి పరీక్షలు నిర్వహించగా 74 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మసీదు సమావేశాలకు వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించి సమావేశంలో పాల్గొన్న వారిని, వారి కుటుంబ సభ్యులను ఒప్పించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.

తెలంగాణ నుంచి మర్కజ్ మసీదు సమావేశాలకు 1030 మందికిపైగా హాజరైనట్టు తేలింది. పాజిటివ్ కేసులు పెరగడానికి వీరే కారణమని నిర్ధారణ అయింది. మర్కజ్ మసీదు సమావేశాలకు వెళ్లొచ్చిన వారిలో ఇప్పటికే 20 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిజాముద్దీన్ వెళ్లినవారిలో 70 శాతం మందిని గుర్తించిన ప్రభుత్వం, 90 శాతం మంది ఫోన్ నంబర్లను సేకరించింది. మిగిలిన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు.

Related posts