ఆసరా పింఛన్ల లబ్దిదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం అందిస్తున్న పింఛన్లను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన పింఛన్లు జూన్ నెల నుంచి అమలు కానున్నాయి. ఈ మేరకు పెరిగిన పింఛన్లు జులై నెలలో లబ్దిదారులకు అందనున్నాయి. దివ్యాంగులకు నెలకు రూ. 3016, మిగతా వారికి రూ. 2016 పింఛను అందనుంది.
దివ్యాంగులకు నెలకు రూ.3016, మిగతా వారికి రూ. 2016 పింఛన్ అమలు చేయనుంది. పెరిగిన పింఛన్లు జూన్ నెల నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. పింఛన్లను పెంచుతామని టీఆర్ఎస్ పార్టీ గడిచిన శాసనసభ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ హామీ మేరకు ప్రభుత్వం పింఛన్ల పెంపు హామీని అమల్లోకి తీసుకువచ్చింది.
పార్టీల వైఖరి కారణంగానే ఫిరాయింపులు: విజయశాంతి