తెలుగు-తమిళ భాషల్లో చిరస్మరణీయ చిత్రాలెన్నిoటినో ‘ఎడిటింగ్’ చేసిన ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ అకాల మరణం పట్ల ‘నేనెవరు’ చిత్ర బృందం ప్రగాఢ సంతాపం తెలియజేసింది. సెల్వ రాఘవ దర్శకత్వంలో రూపొందిన “నన్ను వదలి నీవు పోలేవులే” చిత్రం ద్వారా హీరోగా పరిచయమయిన కోలా బాలకృష్ణ (కోలా భాస్కర్ తనయుడు) నటిస్తున్న ‘నేనెవరు’ చిత్రానికి కోలా భాస్కర్ ఎడిటర్. ఈ చిత్రమే కోలా భాస్కర్ ఎడిటింగ్ చేసిన చివరి చిత్రం. షూటింగ్ పూర్తి చేసుకున్న “నేనెవరు” ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. తమ చిత్ర కథానాయకుడి తండ్రి- తమ చిత్రానికి ఎడిటర్ కూడా అయిన కోలా భాస్కర్ మరణం తమకు తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నామని “నేనెవరు” చిత్రబృందం పేర్కొంది!!!
previous post
next post