మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోండగా.. చెర్రికి జోడిగా పూజ హెగ్దే నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఆచార్య నుంచి సెకండ్ సింగిల్ పేరుతో పూజ హెగ్డేపై సాగే ‘నీలాంబర్’ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు . దీపావళి సందర్భంగా గురువారం ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేస్తూ ఫుల్ లిరికల్ సాంగ్ నేడు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి’ అంటూ ఈ పాట సాగుతన్న ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. అనురాగ్ కులకర్ణి – రమ్య బెహ్రా ఆలపించారు. ఈ మెలోడీ సాంగ్లో చరణ్, పూజ కెమిస్ట్రీ అదిరిపోయింది.
కొణిదెల ప్రొడక్షన్స్లో నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.