telugu navyamedia
క్రీడలు వార్తలు సినిమా వార్తలు

‘నీదీ నాదీ ఒకే కథ’ నటరాజన్…

ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమయి మే 30న ముగుస్తుంది. ఐపీఎల్‌ 2021 కోసం పలు జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి. ఇప్పటికే ఆటగాళ్లు అందరూ ప్రాక్టీస్ మొదలెట్టారు. లీగ్ ఆరంభానికి సమయం సమీపిస్తుండటంతో.. జట్లన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఇక అభిమానులతో తాజా విశేషాలు పంచుకోవాలని ప్రాంఛైజీలు కూడా ఆరాటపడుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా ఆకట్టుకొనే విషయాలు చెబుతున్నాయి. అయితే అన్ని ఐపీఎల్ జట్లలో కెల్ల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగు కథానాయకులు, చిత్రాల నేపథ్యంలో ట్వీట్లు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇప్పటికే స్టార్ బ్యాట్స్‌మన్‌ మనీశ్ ‌పాండేను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌గా, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను మహేష్ బాబులా చూపించిన సన్‌రైజర్స్‌.. తాజాగా యార్కర్ కింగ్ టీ నటరాజన్‌తో ‘నీదీ నాదీ ఒకే కథ’ పోస్టర్‌ పంచుకుంది. ‘ఇది నట్టు కథ, మీ కథ.. మీది, నట్టూదీ ఒకే కథ’ అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. అయితే ఇంగ్లండ్ సిరీస్ అనంతరం నేరుగా జట్లతో కలిసేవారికి క్వారంటైన్ మినహాయింపు ఉంది. అయితే నట్టూ బబుల్ ధాటి ఇంటికి వెళ్లొచ్చాడు. దాంతో అతను ప్రస్తుతం అతను క్వారంటైన్‌లో ఉన్నాడు.

Related posts