telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేబీసీ-12 : ఈ సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి మహిళ

KBC

హిందీ బుల్లితెర షో కౌన్ బనేగా క్రోర్‌పతి-12 సెప్టెంబరు 28న మొదలైంది. కరోనా వైరస్ కారణంగా ఈ సీజన్‌లో పలు మార్పులు చోటుచే సుకున్నాయి. ఈసారి ఆడిషన్స్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈసారి తొలిసారి ఆడియన్స్ పోల్ లైఫ్‌లైన్‌ను ఎత్తివేశారు.ఇక అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్‌-12లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళగా నజియా నసీమ్ రికార్డు సృష్టించబోతున్నారు. ఈ నెల 11న ప్రసారం కానున్న షో ప్రోమోను సోనీటీవీ ట్వీట్ చేసింది. ఢిల్లీకి చెందిన కమ్యూనికేషన్ మేనేజర్ నజియా నాసిమ్, హోస్ట్ అమితాబ్ ఎదురుగా కూర్చుని ఉన్న వీడియోను పోస్ట్ చేసింది సోనీటీవీ. ఆమె తెలివితేటలను ప్రశంసించిన అమితాబ్ గేమ్ గొప్పగా ఆడారని కొనియాడాడు. అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా, అమితాబ్ ఒక్కసారిగా తన గంభీరమైన గొంతుతో ‘ఏక్ కరోడ్’ అని కరతాళ ధ్వనుల మధ్య చెబుతాడు. నజియా తనను తాను నమ్మలేకపోయారు. కాసేపటి తర్వాత కానీ, తేరుకోలేకపోయారు. అమితాబ్ ఆ తర్వాత 7 కోట్ల రూపాయల ప్రశ్న అడగడంతో వీడియో ముగిసింది.

Related posts