లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు దశాబ్ధాలుగా ఆమె సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. వివాహం తర్వాతా వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు.
ఇప్పటికే.. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్తో ‘జవాన్’, టాలీవుడ్ కథానాయకుడు చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ సినిమాల్లో నటిస్తున్న నయన్ తాజాగా తన 75వ చిత్రాన్ని ఖరారు చేశారు.
ఈ సినిమా #LadySuperStar75 వర్కింగ్ టైటిల్తో మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నాద్ స్టూడియోస్, ట్రిడెంట్ ఆర్ట్స్ సంస్థలతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ‘జీ స్టూడియోస్’ తెలిపింది.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవుతుందని పేర్కొంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు నీలేశ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ చిత్రంలో జై, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించనున్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రముఖ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇంతకు ముందు నటించని పాత్రలో నయనతారను చూస్తారని’ పేర్కొన్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అందిస్తామని నిర్మాతలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి దినేష్ కృష్ణన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Announcing #ladySuperstar75 🥳
Zee Studios is excited to collaborate with #Nayanthara for her 75th film! 💃🏻
The shoot will begin soon! 🎬#Jai #SathyaRaj @Nilesh_Krishnaa @dineshkrishnanb @tridentartsoffl @Naadstudios pic.twitter.com/nVVCnLek83— Zee Studios (@ZeeStudios_) July 12, 2022
మోహన్ బాబుపై దాసరి పెద్ద కోడలు ఫైర్