మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన అనుష్క, నయనతారల పేర్లు వినిపించినప్పటికీ… ఇప్పుడు వీళ్లిద్దరూ కాదని తేలిపోయింది. మెగాస్టార్. ఖైదీ నెం 150లో తనతో జోడీ కట్టిన కాజల్నే మరోసారి ఈ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారని తెలుస్తుంది. కాజల్ అగర్వాల్నే దాదాపుగా ఫైనల్ చేసారని ప్రచారం జరుగుతుంది. పైగా ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత కావడంతో కాజల్ పని మరింత సులువు కానుంది. ఈమెకు చిరంజీవి కోసం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని తెలుస్తుంది. సైరా తర్వాత చిరు వచ్చి ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతాడు. ఇదిలా ఉంటే చిరంజీవి రైతుగా నటించబోతున్నాడని తెలుస్తుంది. నిరుద్యోగంతో పాటు రైతుల నేపథ్యంలో చిరంజీవి, కొరటాల సినిమా రానుంది. మరోసారి తనకు అచ్చొచ్చిన సామాజిక నేపథ్యం ఉన్న కథతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దర్శకుడు కొరటాల. “భరత్ అనే నేను” తర్వాత ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకుని కొరటాల చేస్తున్న సినిమా ఇది. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. అక్టోబర్ 2న సైరా విడుదల కానుండగా.. కొరటాల శివ సినిమాను 2020 ద్వితీయార్థంలో విడుదల చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్.