telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రియుడితో నయన్ ప్రత్యేక పూజలు

Nayan

దక్షిణాది అగ్ర కథానాయిక, లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన “దర్బార్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో జతకట్టింది నయన్. తాజాగా తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి ఆలయానికి వెళ్లింది. కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. దీనిక ప్రత్యేక కారణం నయన్ ప్రస్తుతం చేస్తున్న ఒక దీక్ష. హాస్య నటుడు, హీరో ఆర్జే బాలాజీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం `మూక్కుత్తి అమ్మన్`. ఈ సినిమాలో నయన్ అమ్మవారి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో నటించినన్ని రోజులూ మాంసాహారాన్ని ముట్టుకోనని నయన్ దీక్ష చేపట్టిందట. ఈ విషయాన్ని బాలాజీ కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. అయితే బాలాజీ నుంచి ప్రకటన వచ్చిన సమయంలో నయన్ తన ప్రియుడితో కలిసి విదేశాలకు విహార యాత్రకు వెళ్లింది. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. `నయన్ చేస్తున్న దీక్ష ఇదేనా` అంటూ పలువురు ట్రోలింగ్ చేశారు. అయితే ఈ సినిమా చిత్రీకరణలో నయన్ మంగళవారం నుంచే పాల్గొంటోంది. చిత్రీకరణకు హాజరయ్యే ముందు విఘ్నేష్‌తో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నయన్ దీక్షను ప్రారంభించిందట.

Related posts