టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా హిట్ అయినప్పటికీ, ఇటీవల వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమా ఆయన కెరియర్లోనే చెప్పుకోదగిన విజయాన్ని అందుకుంది.
ఆ తరువాత ఒకటి రెండు కాంబినేషన్లతో ఆయన పేరు వినిపించినప్పటికీ, అవి కార్యరూపాన్ని దాల్చలేదు. తాజాగా ఆయన ఒక కొత్త డైరెక్టర్ కల్యాణ్ శంకర్ సినిమా చేయడానికి అంగీకరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అప్పుడు మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి నవీన్ కాస్త లేట్ చేసినా పెద్ద బ్యానర్లోనే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం.