చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచానికి చాలా నడిష్టం కలిగించింది. అయితే ఈ లాక్ డౌన్ లో సినీ పరిశ్రమలో థియేటర్లు మూతపడి చాలా మంది నష్టపోయారు. కానీ ఓటీటీలో సినిమాలు రిలీజ్ అయిన సమయంలో ఓటీటీ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నవీన్ చంద్ర. అతను నటించిన ‘భానుమతి అండ్ రామకృష్ణ’ చిత్రం ఆహా లో స్ట్రీమింగ్ అయ్యి చక్కని ఆదరణ పొందింది. ఇక తాజాగా ప్రవీణ్ వర్మ దర్శకత్వంలో నవీన్ చంద్ర నటించిన ‘సూపర్ ఓవర్’ ఓటీటీ మూవీ సైతం జనాన్ని ఆకట్టుకుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగానూ, కొన్ని సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తున్న నవీన్ చంద్ర తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నవీన్ చంద్ర హీరోగా అరవింద్ దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు ఓ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని నిర్మించబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రామాంజనేయులు ఈ సినిమాను ఇదే నెలలో గ్రాండ్ గా ప్రారంభించి, ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపబోతున్నారు. జిబ్రాన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి పి.జి ముత్తయ్య సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. సిద్దార్ధ్ ఎడిటింగ్ భాధ్యతలు నిర్వహిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా నవీన్ కు మంచి హిట్ అందిస్తుందా… లేదా అనేది.
previous post
టన్ను ఇసుక ధర రూ.370 అని చెప్పి.. రూ.900 వసూలు : పవన్ కల్యాణ్