వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మహర్షి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని దిల్రాజు, పొట్లూరి ప్రసాద్, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్గా నిలిచిన “మహర్షి” చిత్రం ఈ నెల 27కి 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఇప్పటికి ఈ చిత్రం 200 కేంద్రాల్లో సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. దీంతో చిత్ర బృందం జూన్ 28వ తేదీన హైదరాబాద్ శిల్పకళా వేదికలో 50 రోజుల వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా నేచురల్ స్టార్ నానీని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రస్తుతం మహేష్ తన 26వ సినిమాకి సిద్ధమవుతుండగా, నాని “గ్యాంగ్ లీడర్” అనే చిత్రంతో బీజీగా ఉన్నాడు.
టాలీవుడ్, నిర్మాతలు మారాల్సిన టైమ్ వచ్చేసింది..