telugu navyamedia
రాజకీయ

భారీ మెజార్టీతో మోదీ ఘన విజయం

against bjp trying to apply last weapon as mp resigns

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో మూడు లక్షల అరవై వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన పీఎం నరేంద్ర మోదీ భారీ  మెజార్టీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి షాలినీ యాదవ్ పై నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో భారీ విజయం సాధించారు. 

ఇక్కడి నుంచి వరుసగా రెండో సారి మోదీ పోటీ చేసి గెలుపొందారు.   స్పష్టమైన మెజారిటీతో బీజేపీ గెలుపు దిశగా దూసుకువెళ్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టనున్న నేపథ్యంలో శ్రీలంక ప్రధాని విక్రమ్‌ రణసింగే, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తదితరులు ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు మోదీ గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

Related posts