ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈ రోజు పార్లమెంట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు, తెలంగాణ ఎంపీలు గరికపాటి మోహన్రావు, సోయం బాపురావు, అరవింద్, బండి సంజయ్ తదితరులు మోదీని కలిసిన వారిలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
కష్టపడి పని చేయాలని బీజేపీ నేతలకు సూచించారు.తెలంగాణలో పరిస్థితులను మోదీ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు బీజేపీ ఎంపీలతో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ ప్రసాదాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ప్రధాని మోదీకి ఇచ్చారు. కేంద్రం నుంచి రావలిసిన పెండింగ్ నిధులపై ఎంపీలు ప్రధానితో మాట్లాడినట్లు తెలుస్తోంది.