telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

కందుకూరులో రహస్యంగా టెన్త్ క్లాసులు: ఐదుగురు అరెస్ట్

ఏపీలో లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో గుట్టుచప్పుడుకాకుండా పదో తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్న ఓ విద్యా సంస్థపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో రహస్యంగా పదో తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పట్టణంలోని తూర్పు వడ్డెపాలెంలో ఓ టెన్త్ విద్యార్థిని ఇంట్లో, 25 మందిని కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. వార్డు వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగుల ద్వారా సమాచారాన్ని అందుకున్న పట్టణ పోలీసులు, తనిఖీలు జరుపగా, 25 మందికి తరగతులు నిర్వహిస్తున్నట్టు తేలింది. దీంతో ఐదుగురు టీచింగ్ స్టాఫ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు,  నారాయణ పాఠశాలకు మెమోను జారీ చేశారు.

Related posts