telugu navyamedia
Uncategorized

నరసింహన్ కు వీడ్కోలు పలికిన కేసీఆర్

KCR and Narasimhan

నేటితో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవీకాలం ముగిసింది. సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రగతి భవన్ లో ఆయనను ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తన సొంత నగరమైన చెన్నైకు ఆయన ఈ రోజు బయల్దేరారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు నరసింహన్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. దీంతో, గవర్నర్ గా నరసింహన్ శకం ముగిసింది. తెలంగాణ గవర్నర్ గా రేపు తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా 9 ఏళ్ల 9 నెలల పాటు కొనసాగిన నరసింహన్ ప్రస్థానం ముగిసింది.

Related posts