telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జనాలు చనిపోతుంటే.. జగన్ ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తున్నారు : లోకేష్

ఏపీ సిఎం జగన్ పై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ” ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోతుంటే తాడేపల్లి నివాసంలో సిఎం జగన్ గారు ఐపీఎల్ మ్యాచ్లు మిస్ అవ్వకుండా చూస్తున్నారు.విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.ప్రతిపక్షంగా ప్రతి రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరిస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోయింది.ఆసుపత్రుల్లో బెడ్లు,ఆక్సిజన్,మందులు అందక ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు పేరాసిట్మాల్,బ్లీచింగ్ కబుర్లు మాని ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.తాడేపల్లి ప్యాలస్ బయటకి వస్తే వాస్తవాలు తెలుస్తాయి.తక్షణమే బెడ్లు,ఆక్సిజన్,మందులు కొరత లేకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ” అంటూ సిఎం జగన్ పై విరుచుకు పడ్డారు.

Related posts