రాష్ట్రంలో ధరలు పెంచుతూ సీఎం జగన్ పేదల రక్తాన్ని సైలెంట్ గా తాగేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు.పెట్రోలు, డీజిల్ ధరలపై రూ.2 వరకు పెరిగేలా వ్యాట్ ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఓ పత్రికలో వచ్చిన కథనంపైస్పందించారు. ఎన్నికల ముందు పెంచుకుంటూ పోతానని వైఎస్ జగన్ అంటే సంక్షేమ కార్యక్రమాలేమో అనుకున్నానని, కానీ ప్రజలపై భారం అని ఇప్పుడర్థమవుతోందని విమర్శించారు.
ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు పెంచేశారని, ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచేశారని వివరించారు. ఈ క్రమంలో రేపో, మాపో విద్యుత్ చార్జీలు పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పెట్రో బాంబు వేయడం దారుణమన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటుపై బ్రదర్ అనిల్ హాట్ కామెంట్స్