telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అర్హులతో పోస్టులు భర్తీ చేయాలి: లోకేశ్ డిమాండ్

Nara Lokesh

సచివాలయ నియామకాల నోటిఫికేషన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కు లోకేశ్ లేఖాస్త్రం సంధించారు. నోటిఫికేషన్ లో ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి, మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

అన్ని పోస్టులకు వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులే వేల సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో మరో నోటిఫికేషన్ ఇవ్వడం అంటే వెయిటింగ్ లో ఉన్నవారికి అన్యాయం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండోసారి పరీక్ష నిర్వహించే అవకాశం లేదని చెప్పారు. మొదటి నోటిఫికేషన్ లో అర్హత సాధించిన అభ్యర్థులతోనే పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు.

Related posts