నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా ‘శ్యామ్సింగరాయ్’ . కలకత్తా బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా..మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అభిమానులకు ఆకట్టుకున్నాయి.
తాజగా నాని అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ‘శ్యామ్సింగరాయ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24 థియేటర్లలోకి విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించడం సహా నాని, సాయి పల్లవి కలిసి ఉన్న ఫోటోను రివీల్ చేశారు..
పీరియాడికల్, మోడ్రన్.. రెండు కలిసేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్లు చూస్తుంటే తెలుస్తోంది. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
అయితే నాని గత రెండు సినిమాలు ‘వి’, ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఎట్టకేలకు ఈ చిత్రం థియేటర్లలో వస్తుండటం వల్ల ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆ సినిమా అంటే చంద్రబాబుకు భయం: లక్ష్మీపార్వతి