నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్ (సివిఎం) నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.8 చిత్రం ఫిబ్రవరి 18న ఉదయం 10.49 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తం షాట్కి సూపర్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్నివ్వగా, శ్రేష్ఠ్ మూవీస్ అధినేత ఎన్.సుధాకర్రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ అధినేత శరత్మరార్ స్క్రిప్ట్ని అందించారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 19 నుంచి నాన్స్టాప్గా జరుగుతుంది. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని, కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో నాని సరసన ఐదుగురు హీరోయిన్స్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం హాలివుడ్లో వచ్చిన “ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్ బటన్” అనే సినిమా స్పూర్తితో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాని మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారట. అందులో ఒక పాత్ర యంగ్ క్యారెక్టర్, మరొకటి మిడిల్ ఏజ్ క్యారెక్టర్, చివరది ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ అనేది మీడియా వర్గాల సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో విలన్గా “RX100” ఫేమ్ హీరో కార్తికేయ విలన్గా నటిస్తున్నాడు.