సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అనారోగ్యంతో సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్లో ఉంచారు. ఆయనకు తుది నివాళులు అర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ఫిలింఛాంబర్కు తరలివస్తున్నారు.
హీరో నందమూరి బాలకృష్ణ కూడా సిరివెన్నెల భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య ఎమోషనల్ అయ్యారు. “తెలుగు భాషకు, సాహిత్యానికి సిరివెన్నెల భూషణం. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మహానుభావుడు సిరివెన్నెల.
1984లో విశ్వనాథ్ దర్శకత్వంలో తాను నటించిన జననీ.. జన్మభూమి చిత్రంతోనే సిరివెన్నెల సినీ పరిశ్రమకు పరిచయం కావడం తన అదృష్టమన్నారు. సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉందన్నారు. తనకు సాహిత్యం అంటే ఇష్టమని.. సిరివెన్నెలతో కలిసినప్పుడల్లా తాము సాహిత్యంపై ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం అని తెలిపారు.
పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకే సిరివెన్నెల వెళ్లిపోయారంటూ బాలయ్య కంటతడి పెట్టుకున్నారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు” అని బాలకృష్ణ అన్నారు.
“వెంకీమామ”లో రకుల్ పాత్రను కొట్టేసిన రాశిఖన్నా