ఏపీ రాష్ట్రంలో ఉగాది నుంచి 26 జిల్లాలు నుండి పాలన కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించారు. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ పై ప్రజలు తమ సూచనలు,సలహాలతో పాటు అభిప్రాయాలను తెలపాలని ప్రభుత్వం కోరింది. వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రజలకు గడువును ఇచ్చింది.
ఈ క్రమంలో ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటును హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతించారు. హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలని బాలయ్య డిమాండ్ చేశారు
జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయొద్దని ఏపీ ప్రభుత్వాన్ని బాలకృష్ణ కోరారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి పార్లమెంట్ కేంద్రం ఒక జిల్లా కావాలని బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వీడియో సందేశం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
హిందూపురం వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిదని పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి అవసరమయ్యే సదుపాయాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. పరిసర ప్రాంతాల వాసులు హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26న జారీ చసిన నోటిఫికేషన్ పై ప్రజలకు నెల రోజుల సమయం ఇచ్చింది. నెల రోజుల్లో సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తెలపాలని ప్రభుత్వం కోరింది