ప్రస్తుతం కరోనా భయంతో స్కూల్స్, థియేటర్స్, షూటింగ్స్, పెళ్ళిళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు. ఇప్పటికే షూటింగ్లు ఆగిపోయాయి. మరోవైపు సినీ సెలెబ్రిటీలు తమ అభిమానులకు కరోనా నుంచి ఎలా దూరంగా ఉండాలో సూచిస్తున్నారు. అందులో భాగంగానే సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ ను విసురుతున్నారు. ఇందులో సినిమా సహా అన్నీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మరో ముగ్గురికి సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ను విసురుతున్నారు. రీసెంట్గా ఈ ఛాలెంజ్లో సూపర్ స్టార్ మహేశ్ శ్రీమతి నమత్ర శిరోద్కర్ పాల్గొన్నారు. ‘‘కోవిడ్ 19 బారిన పడకుండా ఉండటానికి రెండు చేతులను శుభ్రం చేసుకోవాలి. 20-40 సెకన్ల పాటు రెండు చేతులను రుద్ది శుభ్రం చేసుకుంటే మంచిది. “స్టే సేఫ్టీ.. స్టే హెల్దీ” అంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియోతో పాటు మెసేజ్ను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
previous post
next post