ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి చంద్రబాబు మోదీని ఆహ్వానించారు.
మే 2వ తేదీన జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
మరోవైపు ప్రధానితో భేటీ అనంతరం చంద్రబాబు సమావేశం వివరాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించినట్లు ట్వీట్ చేశారు. ”
అమరావతి పునఃప్రారంభమవుతోంది. మన ప్రజా రాజధాని నిర్మాణం త్వరలో తిరిగి ప్రారంభమవుతుంది, ఆశను తిరిగి బతికించడమే కాకుండా మన రాష్ట్రం సుసంపన్న భవిష్యత్తు వైపు ప్రయాణంలో ఇదో చరిత్రాత్మక మైలురాయి.
ఈ ప్రత్యేక క్షణాన్ని స్మరించుకోవడానికి, అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి అమరావతిలో మాతో చేరాలని ప్రధాని మోదీని ఈ రోజు నేను ఆహ్వానించాను.” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
మరోవైపు అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు.
ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఆమస్టర్డ్యామ్, సింగపూర్, టోక్యో తరహాలో అమరావతి నిర్మాణం ఉండాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అమరావతి ప్రాజెక్టులో తొలి దశ నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
చంద్రబాబుకు ఫేస్ వాల్యూ లేదు: లక్ష్మీపార్వతి