telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనాకు ఎన్సీబీ ఎందుకు సమన్లు ఇవ్వలేదు ?… నగ్మా ఫైర్

Nagma

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ కోసం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తెలియడంతో రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) లోతుగా విచారణ చేపడుతోంది. ఇప్పటికే దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌తో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు నోటీసులు అందాయి. ఈ తరుణంలో డ్రగ్స్ ఇష్యూపై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేసింది సినీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా. “వాట్సాప్‌ మెసేజ్ ల ఆధారంగా కొంతమంది సెలబ్రిటీలకి మన్లు జారీ చేసినప్పుడు..స్వయంగా డ్రగ్స్‌ తీసుకున్నానని చెప్పిన కంగనా రనౌత్‌కు ఎన్సీబీ అధికారులు సమన్లు ఎందుకు ఇవ్వలేదు? సెలబ్రిటీల సమాచారాన్ని పత్రికలకు అందచేసి వారిని ప్రజల్లో అపఖ్యాతి పాలుచేయడం ఎన్సీబీ విధా? ఇది నిజంగా విచారకరమైన విషయం” అంటూ ట్వీట్ చేశారు నగ్మా. అంతేకాకుండా దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, దీపికా పదుకొణె, దియా మీర్జా.. వీళ్లంతా గతంలో బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పారని, అందుకే వారిని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ నగ్మా కొన్ని ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

ఇక కంగనా విషయానికొస్తే గతంలో ఓ వీడియోలో మాట్లాడుతూ “నటిని కావాలన్న ఉద్దేశంతో ఇంటినుంచి పారిపోయి ముంబైకి వచ్చాను.. కొన్ని సంవత్సరాల తర్వాత హీరోయిన్ అయ్యాను.. అంతేకాకుండా డ్రగ్స్‌కి బానిసయ్యాను. నేను యుక్తవయసులో ఉన్నప్పుడు ఇది జరిగింది. నేను చాలా మంది చెడ్డవ్యక్తులతో ఇబ్బంది పడ్డాను” అని పేర్కొంది. మార్చి నెలలో కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన స్వస్థలమైన మనాలిలో ఉన్నప్పుడు కంగనా ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Related posts