telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్లాస్టిక్ ను ఏరివేసేందుకు..రోజా “బియ్యం” ఆఫర్!

roja ycp mla

నియోజకవర్గంలో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ‘బియ్యం ‘ పథకాన్ని ప్రవేశపెట్టారు. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చి కిలో బియ్యం తీసుకు వెళ్లాలంటూ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా రోజా సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. నియోజకవర్గం లో ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీ, వార్డు పరిశుభ్రంగా ఉండాలని, ఇందుకోసం ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా ఏరివేయాలని పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛ నగరి’ నియోజకవర్గాన్ని సాధించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, అందరికీ ఆదర్శంగా నిలుద్దాం అని సూచించారు.

Related posts