telugu navyamedia
సినిమా వార్తలు

“జబర్దస్త్”ను వీడే ప్రసక్తే లేదు : నాగబాబు

nagababu1

బుల్లితెరపై పాపులర్ అయిన “జబర్దస్త్” కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంతగానో ప్రజాదరణ పొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ ఈ ప్రోగ్రాంకు నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఈ షోలో కొత్త జడ్జిలు అలనాటి అందాల తార మీనా, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కన్పిస్తున్నారు. తమ పార్టీలకి సంబంధించిన కార్యకలాపాల్లో నిమగ్నమైపోయిన నాగబాబు, రోజా రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఈ విషయంపై నాగబాబు స్పందించారు.

‘జబర్దస్త్’ షో వదిలేసే ప్రసక్తే లేదని, ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా ‘జబర్దస్త్’ మాత్రం కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశారు. నెలకి నాలుగైదు రోజు షో కోసం సమయం కేటాయిస్తే సరిపోతుందని, దాని కారణంగా తన రాజకీయ జీవితానికి ఎలాంటి అడ్డంకి ఉండదని, పైగా ప్రజలను నవ్వించడంలో తను కూడా భాగం అవుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. అంటే నాగబాబు మరికొద్ది రోజుల్లోనే ‘జబర్దస్త్’ షోలో రీఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. మరి నటి రోజా ఈ విషయంలో “జబర్దస్త్” నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related posts